Thursday, May 9, 2024

రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : మందలపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. జామాయిల్ లోడ్‌తో దమ్మపేట వస్తున్న ట్రాక్టర్‌ను మందలపల్లి సబ్ స్టేషన్ వద్ద లారీ ఢీకొట్టడంతో దమ్మపేటకు చెందిన తన్నేరు రాజేష్ (35) ట్రాక్టర్ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అశ్వారావుపేట తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News