Monday, June 16, 2025

పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా

- Advertisement -
- Advertisement -

వేంసూరు : వేంసూరు మండలంలోని రాయుడు పాలెంలో రహదారిపై పైపు లైన్ లీకేజీతో రహదారి పైన రెండు చోట్ల గుంతలు ఏర్పడి తాగునీరు వృథాగా పోయి రహదారి ప్రక్కన నీటితో ఒక నీటి మడుగు ఏర్పడి కోనేరులా తయారైంది.

నీరు వృథాగా పోతున్న గ్రామ పంచాయతీ వారు గానీ, అధికారులు, పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే మరమ్మతులు చేసి లికేజి లు లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News