Tuesday, April 30, 2024

రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం

- Advertisement -
- Advertisement -

రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం
3,37816మంది లబ్ధిదరాలుకు పంపిణీ
రూ.6085కోట్లు వ్యయం
నేడు మంచిర్యాలలో ప్రారంభించనున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి గొల్ల కురుమల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ రెండో విడుత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. శుక్రవారం నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంతటా అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు పశుసంవర్ధక శాఖ మంత్రి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో కూడా రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రలు , ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. కుల వృత్తులను ప్రోత్సహించాలని , గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనల నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం రూపుదాల్చింది.

ఈ పథకానికి సిఎం స్వయంగా విధి విధానాలను రూపకల్పన చేశారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్దికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకం దారుల సొసైటీ లలో సభ్యత్వం కల్పించింది. వీరికి 20 గొర్రెలు, ఒక పొటేలు కలిపి ఒక యూనిట్ గా, ఒక్కో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇందులో ప్రభుత్వం 75 శాతం(93,750 రూపాయలు), లబ్దిదారుడి వావాటాధనం 25 శాతం (31,250 రూపాయలు) చెల్లించాలి.

మొదటి విడతలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 3 లక్షల 93 వేల 552 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వ వాటా నిధులు 3 వేల 751 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటాదనం 1250 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గొర్రెల ధరలు పెరిగిన కారణంగా 2వ విడతలో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయల నుండి 50 వేలకు పెంచి ఒక ఒక లక్ష 75 వేల రూపాయలు చేయడం జరిగింది. ఇందులో ఒక్కో యూనిట్ కు ప్రభుత్వ వాటాధనం ఒక లక్ష 31 వేల 25౦ రూపాయలు కాగా, లబ్దిదారుడి వాటా 43,75౦ రూపాయలు ఉన్నది.

నేటి నుండి ప్రారంభించే 2వ విడతలో 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 6085 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వ వాటాధనం 4,563.75 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటా ధనం కింద రూ.1521.25కోట్లు ఉంది. లబ్ధిదారులకు గొర్రెల యూనిట్‌తో పాటు గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. గొర్రె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌గా గొర్రెను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. అంతే కాకుండా అవసరమైన మందులు, కొనుగోలు చేసిన ప్రాంతం నుండి గొర్రెలను లబ్ధిదారుడి ఇంటివరకూ చేర్చేందుకుఅయ్యే రవాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News