Tuesday, May 21, 2024

నిజామాబాద్‌లో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: విద్యుదాఘాతంతో మంగళవారం రాత్రి ఇద్దరు రైతులు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లిలో జరిగింది. పొలంలో స్టార్టర్‌ను రిపేర్ చేయడానికి రమేష్‌ను లక్ష్మణ్ తీసుకెళ్లాడు. బోరు మోటారు బాగు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురికావడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఒబిసి కోటాయే ఎజెండా కావాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News