Wednesday, May 15, 2024

ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌తో నిమ్స్ డైరెక్టర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఆర్‌టిసి ఉద్యోగులు, సిబ్బందికి మెరుగైన సేవలందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప చెప్పారు. మంగళవారం నగరంలోని బస్‌భవన్‌లో ఆర్‌టిసి ఎండి సజ్జనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను ఆర్‌టిసి ఎండి సజ్జనార్ శాలువాతో సత్కరించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యతో అయినా నిమ్స్‌కి వస్తే నాణ్యమైన వైద్యం అందుతుందని డాక్టర్ బీరప్ప అన్నారు. ఆస్పత్రికి చెల్లింపులను వేగంగా మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఆయన వెంట నిమ్స్ క్రెడిట్ కలెక్షన్ ఇంఛార్జి శ్రీధర్, సురేష్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News