Tuesday, May 14, 2024

పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును గద్దె దించే లక్ష్యంతో పని చేస్తున్నామని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ తెలిపారు. తాను పార్టీ వీడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని ఈటెల తెలిపారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ జరిగిందని, అందుకే చంద్రశేఖర్‌కు పాసు రాలేదని, అంతే తప్ప మరొకటి లేదని ఈటల వెల్లడించారు. పార్టీ బాగుండాలని ఈటలతో చర్చలు జరిపామని మాజీ మంత్రి, బిజెపి నేత చంద్రశేఖర్ తెలిపారు. ఈటల తనకు ఏమీ చెప్పలేదని, తాను పార్టీ ఎలా బాగుచేయాలో ఈటలకు చెప్పానన్నారు. తెలంగాణ బాగుపడాలని తాము చర్చించామన్నారు.

Also Read: చంపాడు… కరెంట్ షాక్‌తో చనిపోయాడని నమ్మించాడు… కానీ అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News