Tuesday, May 14, 2024

చంపాడు… కరెంట్ షాక్‌తో చనిపోయాడని నమ్మించాడు… కానీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కిరాణా షాపులో పని చేస్తున్న వ్యక్తిని యజమాని చంపి అనంతరం కరెంట్ షాక్‌తో చనిపోయినట్టుగా నమ్మించిన సంఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గజనాన్ అనే వ్యక్తి కిరాణా జనరల్ స్టోర్‌లో పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తారాస్థాయికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన యజమాని అతడికి నిప్పంటించాడు. గజనాన్ చనిపోవడంతో కరెంట్ షాక్‌తో చనిపోయాడని ప్రచారం చేశాడు. అతడిని ఆస్పత్రికి కూడా తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా యజమానిపై పోలీసులకు అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

Also Read: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌.. డైలమాలో పాకిస్థాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News