Wednesday, August 27, 2025

వర్ధన్నపేటలో ఆర్టీసి బస్సును ఢీకొట్టిన డిసిఎం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ డిసిఎం వాహనం, ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డిసిఎం క్యాబిన్ లో నలుగురు మహిళా ప్రయాణికులు ఇరుక్కుపోయారు. సమాచారాం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News