Sunday, May 12, 2024

తుపాకీ మిస్ ఫైర్… హెడ్‌కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కబుతర్ఖానలో భూపతి శ్రీకాంత్ అనే హెడ్ కానిస్టేబుల్ విధులు ముగించుకొని నిద్రిస్తున్న సమయంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఐసియు చికిత్స పొందుతూ చనిపోయారు. డిసిపి సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News