Wednesday, May 22, 2024

అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: మానవత్వం మర్చిపోయి సోంత అన్య్యను హత్య చేసి చంపిన దారుణ సంఘటన బెజ్జూరు మం డలంలోని కాటేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన మెరుగు తిరుపతి (45) అతని తమ్ముడు మెరుగు దేవాజీ శుక్రవారం రాత్రి గోడ్డలితో తిరుపతి మెడపై దారుణంగా నరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

మద్యం తాగిన మైకంలో ఇద్దరు గోడవ పడి కుటుంబ తగాదాలతో ఒకరినోకరు దోచుకోని కోపానికి గురైన తమ్ముడు అన్నపై గోడ్డలితో దాడి చేశాడు. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి కౌటాల సిఐ సాదిక్‌పాషా, ఎస్‌ఐ విక్రమ్ ఘటన స్థలానికి చేరుకోని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో దారుణ హత్య జరగడం పట్ల మండలంలోని ప్రజలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News