Friday, May 10, 2024

సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణను పాటించాలని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. సిడబ్ల్యుసి సమావేశంలో ఖర్గే  కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని చెప్పారు. సిడబ్ల్యుసి సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తెలంగాణలో కూడా పాగా వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News