Wednesday, September 17, 2025

రేపు గాంధీ భవన్‌లో బిసి నాయకుల ఆందోళన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసిలకు 30 నుంచి 40 సీట్లను కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్‌లోని బిసి నాయకులు గాంధీభవన్ ఎదుట రేపు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు బిసిలకు అధికంగా టికెట్‌లను కేటాయించాలని కోరుతూ పలువురు బిసి సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని, సోనియాను, మల్లికార్జునఖర్గేలను కలిసి పలుమార్లు విజ్ఞప్తి సైతం చేశారు. అయినా వారి విజ్ఞప్తులను అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బిసి నాయకులు నేడు గాంధీభవన్‌లో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News