Monday, April 29, 2024

ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పార్వతీకుండ్‌లో ప్రార్థనలు

- Advertisement -
- Advertisement -

పిథోర్‌గఢ్ : సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో పర్యటనకు ప్రధాని మోడీ గురువారం ఉదయం పిథోర్‌గఢ్‌కు చేరుకున్నారు. ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. పార్వతీకుండ్ ఒడ్డున ఉన్న శివపార్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శంఖాన్ని పూరించారు. తలపాగా, రంగా (పై వస్త్రం)తో కూడిన సంప్రదాయ గిరిజన వస్త్రధారణతో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆది కైలాస పర్వత శిఖరానికి అభిముఖంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా మోడీకి స్థానిక పూజారులు వీరేంద్ర కుటియాల్, గోపాల్ సింగ్‌లు తోడుగా ఉన్నారు. అక్కడి నుంచి సరిహద్దుల్లోని గుంజీ గ్రామాన్ని మోడీ సందర్శించారు. స్థానికులతోపాటు భద్రతా సిబ్బందితో కూడా ఆయన ముచ్చటించారు. స్థానిక వస్తు ప్రదర్శనను తిలకించారు. సమీపం లోని జగేశ్వర్ ధామ్ లోని శివాలయ సందర్శనకు వెళ్లారు.

ఈ పర్యటనలో భాగంగా కుమావుమ్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పిథోర్‌గఢ్‌లోని ఎస్‌ఎస్ వాల్డియా స్పోర్ట్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత రూ. 4200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నైనిసైని విమానాశ్రయం నుంచి బహిరంగ సభా వేదికకు వచ్చేలోగా కుమయూన్‌కు చెందిన సాంస్కృతిక కళాకారుల బృందాలు ప్రధానికి స్వాగతం పలుకుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News