Monday, May 13, 2024

రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఛేదించింది. భారత్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రూ. 602 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరంలో ఏకంగా 86 కిలోల డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా,

ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. వారిని చుట్టుముట్టిన 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల గుజరాత్, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్ ల్యాబ్‌ల గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రట్టు చేసింది. ఈ ప్రాంతం లోని మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు రూ. 300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News