Monday, May 13, 2024

మనిషి దాహం తీర్చిన ఏనుగు!

- Advertisement -
- Advertisement -

కమలాపూర్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్క్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండలో ఓ వ్యక్తి దాహం తీర్చేందుకు ఏనుగు తొండంతో హ్యాండ్ పంప్ కొట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ పార్కులోని గార్డు సుదీప్ ఏనుగు సాయంతో నీళ్లుతాగి దాహం తీర్చుకున్నాడు. అతడి దాహం తీర్చిన ఏనుగు రూపకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.  అక్కడి ఏనుగుల పార్కులో ప్రస్తుతం తొమ్మిది ఏనుగులు ఉన్నాయి. చుట్టు పక్కల నీటి వనరులు అంతరించిపోయినప్పుడు ఏనుగులు ఇలా హ్యాండ్ పంప్ కొడతాయని ఏనుగు క్యాంప్ నిర్వాహకులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News