Monday, May 13, 2024

భారత్‌ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో జనతాదళ్ (సెక్యులర్ ) అగ్రనేత దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణ భారత్ వీడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ వీడియోలపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా హసన్ జిల్లాలో ఇవి ఎక్కువ ప్రచారం లోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. రేవణ్ణ పేరు చెడగొట్టడానికి నవీన్ గౌర మరికొందరు కలిసి ఈ క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్‌బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్రగౌడ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ మార్ఫ్‌డ్ వీడియోను హసన్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నవీన్ మరికొందరు ఓటర్లకు పంపించారన్నారు.

అంతేకాదు , రేవణ్ణకు ఓటేయవద్దని వారు కోరినట్టు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. హసన్ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994,2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ, దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌డి రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్.జి. అనుపమకూ ఓటమి తప్పలేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, 3152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News