Thursday, May 23, 2024

బొగ్గు గనిలో ప్రమాదం: 12 మంది దుర్మరణం…

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్ జియాంగ్ లోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలో కున్యువాన్ బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం జరిగడంతో 12 మంది మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చైనాలో బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమే. గత కొన్ని సంవత్సరాల నుంచి మరణాల సంఖ్య తగ్గిపోయింది. చైనాలో వచ్చిన భూకంపంలో 130 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News