Thursday, June 19, 2025

భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టి చంపారు..

- Advertisement -
- Advertisement -

భార్య ఆత్మహత్య చేసుకోవడంతో.. భర్తను ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలం చెన్నపల్లి గ్రామానికి చెందిన నాగార్జున సింధును మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ అచ్చంపేటలో నివాసం ఉంటున్నారు.

గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సింధు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. సింధు మృతికి భర్త కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో భర్తను కొట్టి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News