Wednesday, May 8, 2024

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రైవర్ బస్సు నడుపుతుండగా అతడికి గుండెపోటు వచ్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు వద్ద చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా డ్రైవర్ శంకర్ నాయక్ ఒక్కసారిగా హార్ట్‌ఎటాక్ రావడంతో వాహనాన్ని ఆపి స్టీరింగ్‌పై కుప్పకూలాడు. వెంటనే అతడిని 108లో ఆస్పత్రికి తరలించారు. బస్సును ఆపి తమ ప్రాణాలను దేవుడిలా కాపాడారని డ్రైవర్ ను ప్రయాణికులు మెచ్చుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News