Friday, May 10, 2024

శంకర్‌పల్లిలో ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. రవికి(35) ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెయ్యికి మూడు వేల రూపాయలు ఇస్తానని పలువురి వద్ద రవి డబ్బులు సేకరించాడు. రవి వద్ద నుంచి మరో వ్యక్తి డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News