Friday, May 17, 2024

కనీసం ప్రజలకు మంచినీళ్లైనా ఇవ్వండి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం గొంతెండిపోతోందని… నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. ఖాళీ బిందెలతో ధర్నాలు… ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు ఉన్నాయని, పదేళ్ల కెసిఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడు కనిపించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, బిఆర్‌ఎస్ హయాంలో తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పంటకు సాగు నీళ్లు ఎలాగూ ఇవ్వలేదని, కనీసం ప్రజలకు మంచినీళ్లైనా ఇవ్వాలని కోరుతున్నామని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News