- Advertisement -
హైదరాబాద్: తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సిఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆయన నాంపల్లిలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని, లేదా నైతిక బాధ్యత వహించి ఉద్యోగుల డిఎ ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని తెలియజేశారు. 2014 లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లు అని తెలిపారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు అని, ఇప్పటివరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పు రూ. లక్షా 30 వేల కోట్లు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
- Advertisement -