- Advertisement -
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. 2023లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో తల్లిదండ్రులు కానున్నట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు. ‘లైఫ్లో అత్యంత అందమైన రోల్.. కమింగ్ సూన్’ అంటూ తాము పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త చాలాకాలంగా ప్రచారంలో ఉంది. కానీ, వాటిని ఎవరు నిర్ధారించలేదు. కానీ, ఇప్పుడు అధికారికంగా వరుణ్ ప్రకటించడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ అనే సినిమాలో వరుణ్, లావణ్యలు తొలిసారి కలిసి నటించారు. అప్పటి నుంచి లవ్లో ఉన్న వీళ్లు 2023లో వివాహ బంధంతో ఒకటయ్యారు. త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు.
- Advertisement -