Thursday, May 15, 2025

ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతుల కన్నీటి గాథలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కని పెంచిన పిల్లలు కళ్ళ ముందే కనుమరుగు అయినట్టు, ఇంటి దూలం ఇరిగి ఒక్కసారిగా భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలి వానకు తడిసి ముద్ద అయితే అన్నదాతకు ఎంత యాతనా, ఎంత కడుపు కోత? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే కనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు పహారా మధ్య, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు చేసే ఓ రేవంత్ రెడ్డి..ఇకనైనా క్ళ్లు తెరవండి. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వండి…కొనుగోళ్ళు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయండి. దేశానికే అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడండి అని హరీష్ రావు సూచించారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News