- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇక, మంగళవారం తిరుమల వెంకన్నను 76,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,766 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -