పాక్ ఐఎస్ఐ
కోరిన యూట్యూబర్
జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ:పాకిస్థాన్కు గూఢచర్యం ఆ రోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు వి చారణలో మరిన్ని సంచలన విషయా లు వెలుగు లోకి వస్తున్నాయి. పాక్లో వివాహం చేసుకునేందుకు ఆమె సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఐఎస్ఐతో సంబందాలున్న హ సన్ అనే వ్యక్తితో ఆమె గతంలో చేసిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. పాకిస్థాన్ ఐఎస్ఐతో సం బంధాలున్న అలీ హసన్తో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కో డ్ భాషలో ఎన్నో విషయాలు మాట్లాడుకునే వారు. తాజాగా అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను పాకిస్థాన్ లోనే వివాహం చేసుకోవాలని జ్యోతి కోరింది.దీంతో పాటు భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అం తే కాకుండా ఆమెకు నాలుగు బ్యాంకు ఖాతాలున్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని ద ర్యాప్తులో తేలినట్టు సమాచారం. దీని పై మరింత లోతుగా విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానె ల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన త ర్వాత కూడా అతడితో కాంటాక్టు అయినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు , అలీ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్టు అధికారులు అరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్లో నిలిపివేశారు. పాక్ హైకమిషన్కు చెందిన వ్యక్తితో ఆమె వివాహానికి సంబంధించిన చాటింగ్ వివరాలు బయటకొచ్చాయి.