Wednesday, June 4, 2025

నేడు లక్నోతో గుజరాత్ పోరు

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో గుజరాత్

అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో అసాధారణ ఆటతో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ గురువారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. 18 పాయింట్లతో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకున్న గుజరాత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా ఉంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఇద్దరు చెలరేగి ఆడారు.

సుదర్శన్ అజేయ శతకం సాధించగా, గిల్ సెంచరీకి చేరువలో అజేయంగా నిలిచాడు. జోస్ బట్లర్, రూథర్‌ఫోర్ట్, తెవాటియా, షారుక్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అంతేగాక సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. ఇక లక్నో ఇప్పటికే ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా ఊరట పొందాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News