పోలవరంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా
ప్రతిపాదనలకు తీవ్ర అభ్యంతరం తెలిపిన
తెలంగాణ ఇది సిడబ్లూసి అనుమతులకు
విరుద్ధమని వ్యాఖ్య దీని వల్ల గోదావరి,
డెల్టా వ్యవస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయని
ఆందోళన తెలంగాణ చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు
అభ్యంతరం చెప్పే ఎపి పోలవరంపై
ఎత్తిపోతలు చేపట్టడమేమిటి? తక్షణమే
సిడబ్లూసి జోక్యం చేసుకొని ఎత్తిపోతలను
ఆపాలని వినతి గోదావరిబోర్డుకు,
పోలవరం అథారిటీకి రాష్ట్ర ఇఎన్సి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఎపి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సి) అనిల్ కుమార్ శనివారం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, పోలవరం ప్రాజె క్టు అథారిటీ(పిపిఎ)కి లేఖ రాశారు. ఏప్రి ల్ 8న జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీలో ఎత్తిపోతల పనులు ఆపినట్లు పోలవ రం చీఫ్ ఇంజినీర్ తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే పోలవరం డెడ్ స్టోరేజి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపి సిద్ధం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కేంద్ర జల సం ఘం(సిడబ్లూసి) అనుమతి లేకుండా డెడ్ స్టోరేజి లిఫ్ట్ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆ రోపించారు. దీని వల్ల గోదావరి డెల్టా వ్య వస్థ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంద ని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా పో లవరం డెడ్ స్టోరేజి నుంచి నీటిని ఎత్తిపోయడం ఏమాత్రం సమంజసం కాదని ఈ ఎన్సి అనిల్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రా జెక్టుకు నీటి లభ్యత లేదంటూ ఏపి సర్కా రు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయా న్ని ఆలేఖలో గుర్తుచేశారు. ఏపి ప్రభుత్వం మాత్రం డెడ్ స్టోరేజి నుంచి కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం న్యాయం కాదన్నారు. డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం సిడబ్లూసి నిబంధనలకు, అనుమతులుకు విరుద్దమని తెలిపా రు. ఈ విషయంలో
సిడబ్లూసి జోక్యం చేసుకుని ఏపి ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నుంచి ఎత్తిపోతల చేపట్టకుండా చూడాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులకు కూడా ఈచర్య విరుద్దంగా ఉందని అనిల్ కుమార్ లేఖలో స్పష్టం చేశారు. తక్షణమే నదీ యాజమాన్య బోర్డుతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటి జోక్యం చేసుకుని దీనిపై ఏపి సర్కారు ముందుకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు.
గోదావరి బనకచర్ల అనుసంధానం అడ్డుకోండి
ఎపి ప్రభుత్వం గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్టు కొత్త ప్రతిపాదనలను అడ్డుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి)లకు నీటి పారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సి) జి.అనిల్ కుమార్ లేఖ రాశారు. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ పలు సందర్భాల్లో ఈ అంశంపై తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖ ద్వారా వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఏపి ప్రభుత్వం గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్టు కొత్త ప్రతిపాదనలు, అందుకు అయ్యే బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్లుగా ఈనెల 22వ తేదీన ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త ప్రతిని ఆలేఖకు జత చేశారు. గోదావరి బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.