- Advertisement -
జైపూర్: ఐపిఎల్ 18వ సీజన్లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో (MI) జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫర్-1లో చోటు దక్కించుకుంటుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. కాగా, ఈ మ్యాచ్లో పంజాబ్ (PBKS) జట్టు రెండు మార్పులు చేసింది. జెమిసన్, వైశాక్లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు ముంబై (MI) ఒక మార్పు చేసింది. అశ్వని కుమార్కి జట్టులో చోటు కల్పించింది.
- Advertisement -