Thursday, June 5, 2025

క్వాలిఫయర్-2: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్లేఆఫ్స్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో (MI) జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో మంచి జోష్‌లో ఉన్న ముంబై అదే జోరును ఈ మ్యాచ్‌లో కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాలని.. ఆ తర్వాత ఫైనల్స్‌లో కూడా గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడాలని పంజాబ్ పట్టుదలతో ఉంది. పంజాబ్ జట్టులో ఈ మ్యాచ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ జట్టులోకి వచ్చాడు. ముంబై కూడా జట్టులో ఒక మార్పు చేసింది. గ్లీసన్ స్థానంలో టాప్లేని జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News