- Advertisement -
హైదరాబాద్: ఫాల్కన్ కేసులో (Falcon Case) ప్రధాన నిందితుడైన సందీప్ కుమార్ను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేశ వ్యాప్తంగా బాధితుల నుంచి నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట రూ.4,215 కోట్లను వసూళు చేశారు. ఎపి, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫాల్కన్ డైరెక్టర్లపై కేసులు నమోదు అయ్యాయి. నిందితులు సందీప్ కుమార్ నుంచి రూ.2.5 కోట్ల విలువైన మూడు కార్లు, 14 స్థిరాస్తి పత్రాలు, 3 సెల్ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక సందీప్ ఖాతాలో రూ.8 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. సందీప్ను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
- Advertisement -