బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఆర్సిబి విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. అభిమానులను నియంత్రించలేక పోయామని ఆ రాష్ట్ర సిఎం, డిప్యూటీ సిఎం ప్రకటించడం వారి చేతకాని తనానికి నిదర్శనమని ఆయన విమర్శలు చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని.. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనం.. తొక్కిసలాట ఘటనపై కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -