Monday, June 9, 2025

దేశంలో ఆరువేలకు పైగా పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

గత రెండు రోజుల్లో కొత్తగా 769 కరోనా సాంక్రమిక కేసులు పెరగడంతో దేశంలో కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య ఆరువేల మార్కును దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం డేటాను విడుదలచేసింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కేంద్రం మాక్ డ్రిల్స్ చేపట్టి సంసిద్ధతను తనిఖీ చేసింది. అంతేకాక తగినంత ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్స్, అత్యవసర ఔషధాలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. గత 24 గంటల్లో దేశంలో కోవిడ్‌తో ఆరుగురు మరణించగా, 6133 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News