Wednesday, June 18, 2025

భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: జితేంద్రసింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మంగళవారం జరిగే స్పేస్‌ ఎక్స్ (Space X) ప్రయోగంలో మరో ముగ్గురితో కలిసి భారత్‌కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షానికి పయనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ (Jitendra Singh) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇస్రో-నాసా మిషన్ వెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష సంస్కరణలను చేపట్టిందని జితేంద్ర సింగ్ (Jitendra Singh) అన్నారు. ఈ సంస్కరణలతో భారత అంతరిక్షయానానికి మరింత విశ్వాసం కలిగిందని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్‌లకు ఆయన ఘన నివాళులు అర్పించారు. కాగా, రేపటి స్పేస్ ఎక్స్ (Space X) ప్రయోగం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.45కు ప్రారంభంకానుంది. సాయంత్రం 5.52కు రాకెట్ కెన్నడి స్పేస్ సెంటర్‌ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News