భారత్ పాకిస్తాన్ ను టార్గెట్ చేయడం ఖాయం
విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ టెర్రరిస్ట్ లకు మద్దతు కొనసాగిస్తే, భారతదేశం పాకిస్తాన్ ను మున్ముందు కూడా లక్ష్యంగా చేసుకుని తీరుతుందని భారత విధేశాంగమంత్రి ఎస్. జైశంకర్ సుస్పష్టం చేశారు. టెర్రరిస్ట్ లు ఎక్కడ ఉన్నారనే విషయంలో మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్ లో ఎంత లోపలికి పోతే.. మేము పాకిస్తాన్ లో అంత లోపలికీ పోవడం ఖాయం అని ఆయన అన్నారు.
బెల్జియం, ఫ్రాన్స్ లలో వారం రోజుల పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి డాక్టర్ జైశంకర్ పోలిటికో తో మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం జెట్ లకు వాటిల్లిన నష్టంపై ప్రశ్నలకు సమాధానమిస్తూ, విదేశాంగమంత్రి తనకు సంబంధించినంత వరకూ, రాఫెల్ ఎంత ప్రభావంతంగా ఉందా, ఇతర వ్యవస్థలు ఎంత ప్రభావితంగా ఉన్నాయా అన్న అంశంతో సంబంధం లేదని, తనకు గల రుజువులు పాకిస్తాన్ లో ధ్వంసమైన వైమానిక స్థావరాలు, వ్యవస్థలు, దెబ్బతిన్న క్షేత్రాలే నని స్పష్టం చేశారు.
జైశంకర్ లె ఫిగరోకు ఇచ్చి ఇంటర్ వ్యూలో టెర్రరిస్ట్ లు భారతదేశంపై దాడి చేస్తే, వారు పాకిస్తాన్ తో సహా ఎక్కడ ఉన్నా వారిని వేటాడతామని, ఈ విషయంలో భారతదేశం స్పష్టమైన దృక్పథంతో ఉన్నదని, సీమాంతర ఉగ్రవాదం కొనసాగుతున్నంత కాలం, భారత్ ప్రతికారదాడులు తప్పబోవని, ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటామని జైశంకర్ వెల్లడించారు. ఆత్మరక్షణ కు అవసరమైన చర్యలు తీసుకుని తీరతాం. అతి ప్రజల పట్ల
ప్రభుత్వానికి గల ప్రాథమిక విధి.. అని స్పష్టం చేశారు.