హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘ది రాజాసాబ్’(The Rajasaab) . మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ను (Teaser) జూన్ 16న విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కొందరు వ్యక్తులు ఈ టీజర్కు సంబంధించిన దృశ్యాలను సోషల్మీడియాలో లీక్ చేశారు. దీంతో లీకైన దృశ్యాలను నెటిజన్లు తెగ షేర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది. లీకైన దృశ్యాలను షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘‘రాజాసాబ్’కు సంబంధించిన లీక్ కంటెంట్ను కనిపించిన అకౌంట్లను వెంటనే సస్పెండ్ చేయిస్తాము. సినిమాటిక్ అనుభూతి పొందేందుకు ప్రతీ ఒక్కరు ఈ విషయంలో సహకరించాలి. బాధత్యగా సెలబ్రేట్ చేసుకుందాం’’ అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
ప్రభాస్ తొలిసారి హారర్ జోనర్లో సినిమా చేస్తుండటంతో ‘ది రాజాసాబ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 16వ తేదీన విడుదల చేసే టీజర్ కోసం చిత్ర యూనిట్ ఓ భారీ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఈవెంట్ కోసం భారీ సెట్ని కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు జాతీయ మీడియాకు కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.