- Advertisement -
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్థంభించిపోయింది. వాగులు పొంగి పారుతున్నందున అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని బేలా, తాంసి మండల్లాతోపాటు ఇతర మండల్లాలోని పలు వాగులు నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టు కొని పోయాయ్. బేలా మండలం లోని టాక్ లి వద్ద ప్రధాన రోడ్లు కొట్టుకొని పోయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎగువ ప్రాంతలో ఎడా తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. వాగుల సమీపంలో ఉన్న పంట పొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి.వర్ష కాలాన్ని దృష్టి లో పెట్టుకుని జిల్లా యంత్రంగం ముందస్తు చర్యలు తీసుకోక పోవడం వల్ల జిల్లా ప్రజలు అవస్థలను ఎదురుకుంటున్నారు. వెంటనే అధి కారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- Advertisement -