ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో దంపతులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వాళ్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవేంద్ర బైరాగి (36) పరాల్కోట్ గ్రామంలో నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి దేవేంద్ర, ఆయన భార్య కలిసి.. తమ ఇద్దరు కుమార్తెలు జుతికా బైరాగి(9), దీప్తి (12), కుమారుడు దేవరాజ్(6)కు భోజనంలో విషయం కలపి ఇచ్చారు. తర్వాత వాళ్లు అదే ఆహారం తిన్నారు.
అయితే వీరంతా బాధపడుతుండటం గమనించిన స్థానికులు వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దేవేంద్ర, ఆయన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులే వీరు ఈ ఘాతుకానికి పాల్పడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.