Tuesday, June 17, 2025

నేను పిలిస్తే బిజెపిలోకి చిరంజీవి వస్తారు

- Advertisement -
- Advertisement -

పార్టీలోకి ఎవరు వస్తానన్నా ఆహ్వానించేందుకు సిద్ధం స్థానిక
సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం మా ప్రధాన ప్రత్యర్థి
కాంగ్రెస్సే బిజెపి అధ్యక్ష పదవికి రెండుసార్లు క్రియాశీలక సభ్యుడై
ఉంటేనే అర్హత ఈటల రాజేందర్‌కు ఈ నిబంధన వర్తించదు
మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిట్‌చాట్

మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జ నతా పార్టీ (బీజేపీ)లోకి ఎవరైనా వస్తానంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. తాను పిలిస్తే తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీ వి వస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చా లా మంది సినీ ప్రముఖులకు బీజేపీతో సం బంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరు మాత్రం పార్టీకి ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆదివారం కిషన్‌రెడ్డి మీడియా తో చిట్ చాట్‌లో మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్ష ఎంపికపై కొందరు చేస్తున్న ప్రచారం నిజం కాదని ఖండించారు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడై ఉండాలని, అయితే సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌కు ఈ నిబంధన వర్తించదని తెలిపారు.

ఎమ్మెల్యే, ఎంపీగా ఆయన ఇప్పటికే గెలిచినందున ఆ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. బీజేపీలో తర్వాత అధ్యక్షుడు ఎవరో బీఆర్‌ఎస్ వాళ్ళు చెప్పగలరా? అని ప్ర శ్నించిన కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో తర్వాత అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసునని వ్యా ఖ్యానించారు. బిజెపిలో అనేక అంశాల ఆధారంగా నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటూ ఎవరో చెప్పిన దానికి తాము సమాధానం చెప్పాల్సిన అవస రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. స్థానిక అంశాలనే అజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళతామని చెప్పారు.

స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకి తెలియజేయాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా బీజేపీ నియమించిన మండల అధ్యక్షులలో 50 శాతం పైగా బీసీలు ఉన్నారని తెలిపారు. సంస్థాగత ఎన్నికలు పూర్తి కాగానే ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు పథకాలు అందించాలన్నది తమ ఉద్దేశ్యమని వివరించారు.

విభజన చట్టం మేరకే అమరావతికి నిధులు

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలనే అంశం రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని, దాని ప్రకారమే కేంద్రం నడుచుకుంటుందని అన్నారు. తెలంగాణకు టెక్స్‌టైల్ ప్రాజెక్టు, జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు కేంద్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ దేశ వ్యాప్తంగా ఒక నేతగా ఎదగాలని అనుకుంటున్నారని అన్నారు. బీజేపీని ఓడించేందుకు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తో కలిసి పని చేస్తుందని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News