టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగే సిరీస్లో టీమిండియాను విజేతగా నిలిపే సత్తా శుభ్మన్ గిల్కు ఉందని భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ జోస్యం చెప్పాడు. సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా గిల్ తనదైన ముద్ర వేయడం ఖాయమన్నాడు. గిల్లో అపార నాయకత్వ ప్రతిభ దాగివుందన్నాడు. ఇందుకు ఐపిఎల్లో గుజరాత్ టీమ్ను గిల్ నడిపించిన తీరే నిదర్శనమన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా అతనిలో కనిపిస్తుందన్నాడు. సిరీస్లో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. గిల్ సిరీస్తో తిరిగి రావడం తథ్యమన్నాడు. సీనియర్లు లేకున్నా టీమిండియా బలంగానే ఉందన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన భారత్ సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే సిరీస్ ఆసక్తికరంగా సాగే ఛాన్స్ ఉందని కపిల్ పేర్కొన్నాడు.