మన తెలంగాణ/ప్రత్యేక ప్రతినిధి : కోర్టు తీర్పు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మ హేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్ధల ఎ న్నికల గురించి మంత్రులెవరూ మాట్లాడరాదని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తల్లో అనవసరమైన గందరగోళానికి దారి తీయవద్దని ఆయన శుక్రవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న దే తమ లక్షమని ఆయన తెలిపారు. స్థానిక సం స్థల ఎన్నికలు కోర్టుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఎవరూ మాట్లాడరాదన్నారు. ఎవరైనా మాట్లాడితే అనవసరంగా వివాదస్పదమవుతుందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తానే పో టీ చేస్తానంటూ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యల గురించి ప్ర శ్నించగా, అజర్ తన అభిమతాన్ని చెప్పారని, అ లా ఆశించడంలో తప్పేమి లేదన్నారు.
అయితే పార్టీ తరఫున పోటీ చేయడానికి ఉత్సాహం చూ పించే అభ్యర్థులందరి పేర్లను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని, ఎంపిక అధిష్ఠానం చే స్తుందని ఆయన వివరించారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికే టిక్కెట్ ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సాంప్రదాయానికి తెర దించారని ఆయన విమర్శించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చేపల పులుసు ఆరగించి ఆంధ్రకు అనుకూలంగా ఎవరు మాట్లాడారో, తెలంగాణ వాటా తాకట్టు పెట్టారో అందరికీ తెలుసునని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
కొండా మురళీ వ్యాఖ్యలపై విచారణ కమిటీ నియామకం
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ కోసం పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. నివేదిక సాధ్యమైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా పరిశీలకులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అయితే రెండు వైపులా ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. పార్టీ తరపున నియమించిన పరిశీలకుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక ఇస్తుందని ఆయన వివరించారు. పార్టీలో ఎంత పెద్ద వారైనా ఇలా నష్టం కలిగించినట్లయితే సహించేది లేదన్నారు.
ఇంత పెద్ద పార్టీలో చిన్న, చిన్న సమస్యలు తలెత్తడం సహజమేనని, వాటిని పరిష్కరించుకుంటామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందన్నారు. నాయకులైనా, కార్యకర్తలైనా ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నివేదిక వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్కు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన చెప్పారు.