- Advertisement -
లక్నో: ప్రియుడితో హానీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను కసాయి తల్లి చంపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్కాలి గ్రామంలో చెందిన వసీమ్(30), ముస్కాన్ (24) అనే దంపతులు నవిసిస్తున్నారు. వసీమ్ జీవనోపాధి నిమిత్తం ఛండీగఢ్ లో ఉంటున్నారు. ఈ దంపతులకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఇంట్లో లేకపోవడంతో జునైద్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్తో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలు అడ్డుగా ఉండడంతో వారికి కసాయి తల్లి విషమిచ్చి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి.
- Advertisement -