- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో పిన్నాపురం వద్ద ప్రైవేటు సర్వేయర్ను దారుణంగా హత్య చేశారు. గద్వాల్కు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. తేజేశ్వర్కు నెల రోజుల క్రితమే కర్నూలు యువతి ఐశ్వర్యతో పెళ్లి చేశారు. ఐదు రోజుల క్రితం తేజేశ్వర్ కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -