Friday, June 27, 2025

పట్టాలెక్కిన కారు

- Advertisement -
- Advertisement -

రైల్వే ట్రాక్‌పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన
యువతి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి వద్ద ఘటన
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోవడం, భర్త దూరంగా
ఉండడంతో ఆత్మహత్యాయత్నం? అదుపులోకి
తీసుకొని విచారిస్తున్న పోలీసులు సోషల్
మీడియాను షేక్ చేసిన వీడియో

మన తెలంగాణ/శంకర్‌పల్లి: రైళ్లు రయ్ రయ్ మని దూసుకెళ్లే పట్టాలపై కారుతో వెళ్తూ కలకలం సృష్టించింది ఓ మహి ళ. దీంతో నిత్యం ఉదయం సమయంలో రద్దీగా ఉండే ట్రైన్‌ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సినిమాలలో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలు నిజం చేసింది ఆ మహిళ.. రీల్స్ పిచ్చో, మతిస్థిమితం లేకనో, ఏదైనా మాదక ద్రవ్యాల ప్రభావంతో చేసిందో కానీ ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ రైల్వే గేటు నుండి ఓ మహిళ తన కియా కారుతో పట్టాలపైకి దూసుకొచ్చింది. కొండకల్ గేటు, చిన్న శంకర్ పల్లి గేటుల మీదుగా శంకర్ పల్లి స్టేషన్ వైపుకు దూసుకువస్తుండగా స్థానికులు ఆపటానికి ప్రయత్నిస్తే ఖాతరు చేయలేదు. ఈ ఘటనతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి.

రైళ్లోని ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఎట్టకేలకు ఆమెను పట్టుకొని, కారును పక్కకు తోసేశారు. కార్‌కు నెంబర్ ప్లేట్ కూడా పెట్టుకోలేదు. ఆమె తన వద్ద ఉన్న నాన్ కత్తితో వీరిపై దాడికి ప్రయత్నించింది. ఆ మ హిళ చేతులను కట్టేసి పోలీసులకు సమాచారం అందించా రు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును శంకర్‌పల్లి పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. కారును శంకర్ పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, యూపీ ప్రాంతానికి చెందినట్లు భావిస్తున్న ఆ యువతిని 108లో ఆస్పత్రికి తరలించా రు. సుమారు 8 కిలోమీటర్లు ట్రాక్‌పై కారు నడిపింది.

ఉద్యోగం పోవడం.. భర్తతో వేరుగా ఉంటూ
లక్నోకు చెందిన ఒమిక సోనీ క్యాప్ జెమినిలో ఉద్యోగం చే స్తూ పుప్పాల్‌గూడలో విల్లాలో నివాసం ఉంటుంది. లక్షా 50 వేల జీతంతో చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోవడంతోపాటు భర్త కు దూరంగా ఒంటరిగా ఉండటంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. గత రెండు నెలలుగా లక్నో లోని తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం లేదని తెలుస్తోంది. ఉద్యోగం ఉడటం, భర్తకు దూరంగా ఒంటరి జీవితంతో విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించిందా లేక మానసిక డిప్రెషన్‌తో ఇలా చేసిందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

ఆత్మహత్య ప్రయత్నమా? మానసిక ఒత్తిడితోనా?
గత రెండు మాసాలుగా తల్లిదండ్రులతో పాటు సన్నిహితులు, బంధువులు ఎవరోతోను మాట్లాడటం లేదని విచారణలోతెలిసింది.ఈ సందర్భంగా ఆమె ఏమైనా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు తీసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆమెకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.పెంపుడు కుక్కను గురువారం ఉదయం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వదిలేసి,తాను చనిపోతానని పేర్కొని వచ్చినట్లు తెలిసింది..దాంతో ఈమె ఆత్మహత్య చేసుకోవటానికి రైలు పట్టాలపై ర్యాష్ డ్రైవింగ్‌తో ముందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. పోలీసుల విచారణలో ఆమె ఒక్కోసారి ఒక విధంగా చెబుతుంది. డ్యూటీ చేస్తానంటే పేరెంట్స్ ఒప్పుకోలేదని అందుకే ఇలా చేశాను అంటుంది… ఆమె మానసిక పరిస్థితి తెలుసుకోవడానికి, వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ఆస్పత్రి అక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

నిలిచిన రైళ్లు.. తప్పిన ప్రమాదం
ఈ సంఘటనతో శంకర్‌పల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన రైళ్లను శంకర్ పల్లిలో, హైదరాబాద్ నుండి శంకర్ పల్లి వైపుకు రావాల్సిన రైళ్లను నాగులపల్లి స్టేషన్ వద్ద నిలిపివేశారు. చిత్తాపూర్- సికింద్రాబాద్ డెమో, బీదర్ -హైదరాబాద్ ఇంటర్ సిటీ, మరో గూడ్స్ రైళ్లు శంకర్ పల్లిలో, రేపల్లె- వికారాబాద్, హైదరాబాద్- పూర్ణ రైళ్లను నాగుల పల్లిలో నిలిపివేశారు. స్థానికులు, ప్రజల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేసిన వీడియోలు
గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి..కొందరు రైలు ప్రయాణికులతోపాటు కొండకల్, చిన్న శంకర్‌పల్లి రైల్వే గేటుల వద్ద తీసిన వీడియోలు, ఫొటోలు వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాయి. దీంతో ఒక్కసారిగా ఈ సంఘటన వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News