మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గిగ్ వ ర్కర్లకు ది బెస్ట్ పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర కా ర్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. తెలంగాణ గిగ్ వర్కర్ పాలసీ దేశానికే రోల్ మోడల్ అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ప్ర త్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆలోచ న చేస్తోందని ఆయన అన్నారు. రాజస్థాన్, కర్ణాట క రా ష్ట్రాల్లో ఇప్పటికే గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారని ఆయన గుర్తు చేశా రు. త్వరలో తెలంగాణలో కూడా అదే చేయబోతున్నాయని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. శుక్రవా రం గి గ్ వర్కర్ల సమస్యలపై సంబంధిత అధికారులతో సచివాలయంలో మంత్రి వివేక్ సమీక్ష స మావేశం నిర్వహించారు. గిగ్ వర్కర్ల సమస్యలు, వారి నుంచి వచ్చిన సూచనల గురించి అధికారులతో మంత్రి చర్చించారు. అనంతరం ఆయన మీ డియాతో మాట్లాడుతూ గిగ్ కార్మికులు చాలా స మస్యలు ఎదుర్కొంటున్నారని వాళ్లకు హక్కులు కల్పించాల్సిన అవసరం
ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ సిస్టమ్ను తీసుకొస్తామని ఆయన చెప్పారు.
గిగ్ వర్కర్ల పాలసీపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం
యాజమాన్యాలు, గిగ్ వర్కర్ల నుంచి 66 సూచనలు, సలహాలు వచ్చాయని వాటిపై చర్చించి ఎలాంటి సాయం చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ సమ్మిట్లో మాట్లాడారని అలాగే గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని సూచించారని ఆయన తెలిపారు. గిగ్ వర్కర్ల సమస్యలపై కేబినెట్లో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే గిగ్ వర్కర్లతో మాట్లాడారని మంత్రి వివేక్ గుర్తు చేశారు. గిగ్ వర్కర్ల పాలసీపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని ఆయన తెలిపారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనం వచ్చేలా కృషి చేస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారని, కొత్త యాక్ట్ వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త యాక్ట్లో భాగంగా 2 శాతం సెస్ వినియోగదారులు లేదా కంపెనీ యాజమాన్యం భరించాలన్న ప్రతిపాదనను బిల్లులో పొందుపరుస్తామని మంత్రి వివేక్ పేర్కొన్నారు.