Saturday, June 28, 2025

న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(40) ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి 10.30 ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని బలవనర్మణం చెందింది. ఐదు సంవత్సరాల క్రితం భర్తతో ఆమె విడాకులు తీసుకొని స్నేహితుడితో కలిసి జవహర్ నగర్ నివసిస్తున్నారు. స్నేహితుడితో మనస్పర్థలు రావడంతో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఇసి మెంబర్‌గా ఎన్నికయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులు రాంనగర్‌లో ఉంటున్నారు. స్వేచ్ఛ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడిగా శంకర్ పని చేశారు. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో సేవలందించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేస నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News