- Advertisement -
అమరావతి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధాన మంత్రి పివి నరసింహారావు బాధ్యతలు స్వీకరించారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పివి నరసివహారావు 104 జయంతిని పురస్కరించుకుని సిఎం ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్థిక సంస్కరణల (Economic reforms) ద్వారా దేశ గతిని పివి మార్చారని బాబు ప్రశంసించారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పివి కీర్తి గడించారని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి దేశానికి, రాష్ట్రానికి అనేక సేవలు చేశారని లోకేష్ కొనియాడారు.
- Advertisement -