- Advertisement -
హైదరాబాద్: పోలీసు అధికారిగా ఉండి మంచి పుస్తకం రాయడం గొప్ప విషయం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కిల్లాడ సత్యనారాయణ రచించిన పుస్తకం ‘బహుముఖ బనారస్’ ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయ జ్ఞాపికను సత్యనారాయణ ఆయనకు అందించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..ఈ పుస్తకం కాశీలోని అనేక పార్శ్వాలను సృశించిందని అన్నారు. మన సంస్కృతిలో స్త్రీలకు గొప్ప ప్రాధాన్యం ఉంది అని చెప్పారు. యువతలో మార్పు రావాలని, సామాజిక, సాంస్కృతిక (Social cultural) పునర్ వైభవం సాధించాలని సూచించారు. హిందూ అనేది జీవన విధానం అని సంపద, జనాభా, విజ్ఞానం ఉన్న దేశం మనది అని పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాలు వికసిత భారత్ కు తోడ్పడతాయని ఆశిస్తున్నానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
- Advertisement -