Sunday, June 29, 2025

రా చీఫ్‌గా పరాగ్‌జైన్

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర్‌లో కీలక
పాత్ర పోషించిన పంజాబ్ కేడర్
ఐపిఎస్ అధికారి

న్యూఢిల్లీ: భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్‌ఎడబ్లు) తదుపరి చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్‌జైన్ నియమితులయ్యారు. 1989 పంజాబ్ కేడర్‌కు చెం దిన ఆయన జులై 1న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయ న ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత రా చీఫ్ రవిసిన్హా పదవీ కాలం జూన్ 30న ముగియనుండడంతో తదుపరి అధిపతిగా పరాగ్ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా విభాగంలో సూపర్ డిటెక్టివ్‌గా పేరున్న పరాగ్‌జైన్ ఎన్నో కీలక ఆపరేషన్లకు నేతృత్వం వహించారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లోనూ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. పీవోకేతోపాటు పాకిస్థాన్‌లో అనేక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు కొన్ని నిమిషాలే పట్టినప్పటికీ ఈ కచ్చితమైన లక్షాలను సాధించేందుకు మన నిఘా విభాగం కొన్నేళ్ల పాటు గ్రౌండ్ వర్క్ చేసింది. ఇందులో జైన్ ప్రముఖ పాత్ర వహించినట్టు తెలిసింది. 2021లో పంజాబ్‌లో డీజీపీ ర్యాంక్ పొందిన జైన్, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News