మనుషులు మాయమయ్యే కాలం. వివి గణేశానందన్ రచన ‘బ్రదర్లెస్ నైట్’కి అనువాదం. తను శ్రీలంక ఉద్యమ నేపథ్యంలో ఈ నవల రాసిన, ఇందులో జరిగిన చాలా విషయాలకు తెలుగు నేలకు సారూప్యత ఉన్నది. మనుషులు మాయమవడం అక్కడే కాదు ఇక్కడా జరిగింది. వాళ్ళు చనిపోయారనే విషయం తెలిసిన ఆనవాళ్ళు అక్కడే కాదు ఇక్కడా దొరకలేదు. ప్రజాస్వామిక డిమాండ్లతో మొదలైన ఉద్యమాలు అక్కడే కాదు ఇక్కడా ఆధిపత్యం కోసం దాడులు చేశాయి. ఒకరినొకరు చంపుకున్నాయి. మనుషులు మాయమయ్యే కాలం పద్దెనిమిది సంవత్సరాలు రచయిత్రి చేసిన పరిశోధనకు సాహిత్య రూపం ఈ నవల. ఇందులో శ్రీలంక తమిళ మిలిటెంట్ ఉద్యమాన్ని, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, శ్రీలంక ప్రభుత్వాన్ని సునిశితంగా పరిశీలించింది. శ్రీలంక తమిళుల జీవితాల్లో కల్లోల కాలమైన 1980వ దశకంలో ఈ నవల ప్రధానంగా సాగిన ఆ ఉద్యమ పుట్టుక ఎదుగుదల నిర్మూలనలు నమోదు చేసింది.
ఆ అంతర్యుద్ధంలో ఒక కుటుంబం విచ్చిన్నమైన వైనాన్నీ, అప్పటి పరిస్థితులను చిత్రిక పట్టింది. ప్రభుత్వాలు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అనే పేరుమీద వచ్చిన వాళ్ళు, మేమే మీకు ప్రతినిధులం అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరి మధ్య నలిగిపోయింది ప్రజ లు. ఆ ప్రజల కోణం నుండి ఈ నవల సాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవిత శకలాల మీద ఆశల, అడియాసల నడక ఈ మనుషులు మా యమయ్యే కాలం. ఈ నవల మూడు ప్రపంచ ప్రఖ్యాత సాహిత్య పురస్కారాలను (కరోల్ షీలడ్స్ ప్రైజ్ ఫర్ విమెన్ 2024, విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2024, ఏషియన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2023) పొందింది.
అరుణాంక్ లత